Pages

Monday 29 April 2013

ఒక్కసారి చెప్పండి మీ జేజేలు...http://telugu.greatandhra.com/politics/april2013/26c_one_time.php

ఒక్కసారి చెప్పండి  మీ జేజేలు

ప్రజా సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వాలు ధనార్జనే ధ్యేయంగా ప్రజా శ్రేయస్సును గాలికి వదిలేస్తున్నాయి. ఈ రోజు మంచినీళ్ళు దొరకని ఊళ్ళు చాలా వున్నాయి కాని మద్యం దొరకని వూరంటూ వుండదు. పల్లె పల్లెకు  అర్దరాత్రి అపరాత్రి అనకుండా మద్యం విక్రయిస్తున్నాయి. మరోప్రక్క అడుగడుక్కి నోట్లో గొట్టాలు పెట్టి పోలిసుల  చేత తనికీలు నిర్వహిస్తుంది . వాళ్ళ దృష్టిలో ఇంటికెళ్ళి త్రాగండి బాబులు అని అర్ధం కావచ్చు అలా అయితే బార్లుకు బార్లా తెరిచి ఇబ్బడి ముమ్మడిగా లైసెన్సులు ఎందుకు ఇస్తున్నట్లు ?  మరి "బార్లా తెరచిన బార్లలో" తాగిన వాడు రోడ్డు ఎక్కక ఉదయం వరకు అక్కడే పవలిస్తాడా ? ఇంటికెళ్ళి నీట్ గా తయారయ్యి ఫ్రీజర్ లో పెట్టుకొని సోడా పోసుకొని త్రాగటానికి వాళ్ళుకి కుదురుతుందా ? అంత నిలకడ తనం రెక్కలు ముక్కలు చేసుకున్న ఆ  బడుగు జీవులుకు ఎక్కడ వుంటుంది ?

ఈ మద్య జరుగుతున్న చాలా అత్యాచారాలకి రాత్రి పూట పూటుగా మద్యం సేవించి కన్ను మిన్ను కానకుండా యువతుల్ని ఏడిపించి వారితో తోడుగా
 వున్న భర్తల్ని ,అమ్మల్ని , అన్నల్ని,  స్నేహితులని చావ బాది వాళ్ళ ముందే కిరాతకంగా అత్యాచారం చేస్తున్నారు. లేదంటే ఏ లారీ కిందకో బస్సు క్రిందకో తోసేస్తున్నారు . మద్యం మైకంతో  ఇంటికొచ్చిన కొంతమంది తాగుబోతులు  వావి వరుసలు చూడకుండా  కూతురనక,  చెల్లి అనక, పసిపిల్లలనక  అత్యాచారం చేస్తున్నారు. రోజుకు నాలుగు వందలు సంపాదిస్తే మూడువందల మద్యం త్రాగి వందో యాబయ్యో భార్యకు ముస్టివేసి పిల్లలని మల మాలా మాడుస్తున్నారు  మరికొంతమంది బడుగుజీవులు .

ఒక ప్రక్క "మద్యం త్రాగితే ఆరోగ్యానికి హానికరం" అంటూనే బాగా మద్య త్రాగండి , అర్దరాత్రి అపరాత్రి అనకుండా తిరగండి , ఇల్లు ఒళ్ళు గుళ్ళ
  చేసుకోండి అని ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తుంది. ఎన్టీఆర్ పుణ్యామా అని మద్య నిషేధం వచ్చినా కూడా ఎన్నో రోజులు అమలుకు నోచుకోలేదు.  ఆ తరువాత వచ్చిన చంద్రన్న నెమ్మదిగా మద్య నిషేదాన్ని అటకెక్కించి ఇప్పుడు నీతి సూత్రాలు వల్లి వేస్తున్నారు , ఆ తరువాత రాజన్న వచ్చి ఎక్కడో పట్టణంలోనే దొరికే మద్యం సీసాని పల్లె పల్లె కి అందించి అభివృద్ధి బాట పట్టించారు. ఆ తరువాత వచ్చిన  రోసన్న , కిరణనన్నలు కూడా  ఆ అభివృద్దిని అలాగే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని "మద్యాంద్ర ప్రదేశ్" గా మార్చి ప్రజల ఋణం తీర్చుకుంటున్నారు .

కనుక బలిఅవుతున్న బడుగులారా
చితికి పోతున్న చెల్లులారా
అందరూ ఒకసారి చెప్పండి ఈ అన్నలందరికీ మీ జేజేలు.


మీగడ త్రినాధ రావు

No comments:

Post a Comment